అమరావతి, ఏప్రిల్ 25 (globelmedianews.com)
మద్యం గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనపై ఎక్సైజ్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా కన్నెర్ర చేసారు. అయా జిల్లాల పరిధిలో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్కు మీనా ఉత్తర్వులు జారీ చేసారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా స్దాయి డిసిలు, ఎసిలు, ఉన్నతాధికారులకు హెచ్చరికలు చేసారు.
మద్యం ధరలపై ఎక్సైజ్ కమీషనర్ ఆగ్రహం
గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనే కీలకంగా ఇకపై ఎస్టిఎఫ్ బృందాల విస్రృత తనిఖీలు చేయాలని అదేశించారు. పట్టుబడితే తొలుత లైసెన్స్ సస్పెన్షన్, తదుపరి శాశ్వతంగా రద్దు చేస్తామని అయన అన్నారు. విశాఖ ఈవెంట్ విషయంలో ప్రత్యేక విచారణ అధికారిని నియామించారు. శ్రీకాకుళం ఇఎస్ మూర్తిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు.
No comments:
Write comments